మా ప్రాంతంలో ఉండొద్దు
ABN , First Publish Date - 2021-03-08T09:45:28+05:30 IST
మావోయిస్టులు తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ విశాఖ ఏజెన్సీలో మండల కేంద్రమైన గూడెంకొత్తవీధి పంచాయతీకి చెందిన పలు
మీ ఉద్యమం వల్ల మాకు ఒరిగేదేమీ లేదు..
పుల్కు హత్యకు జీకేవీధిలో ఆదివాసీల నిరసన
గూడెంకొత్తవీధి (విశాఖ జిల్లా) మార్చి 7: మావోయిస్టులు తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ విశాఖ ఏజెన్సీలో మండల కేంద్రమైన గూడెంకొత్తవీధి పంచాయతీకి చెందిన పలు గ్రామాల ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఇతర పంచాయతీల్లోని మావోయిస్టు బాధితులంతా ఆదివారం గూడెం కొత్తవీధిలో ర్యాలీ నిర్వహించారు. ఇన్ఫార్మర్ నెపంతో జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ మిలీషియా సభ్యుడు కొర్ర పుల్కుని మావోయిస్టులు శుక్రవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టుల చర్యలను నిరసిస్తూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి, మావోయిస్టులు హింసను వీడాలని, తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మీ ఉద్యమం వల్ల తమకు ఒరిగేది ఏమీలేదని, అన్నం పెట్టిన గిరిజనులనే హత్య చేస్తారా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం మావోయిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు.