గిరిపుత్రుల కష్టాలు

ABN , First Publish Date - 2020-08-14T19:34:42+05:30 IST

వానొస్తే ఏజెన్సీ వాసులకు కష్టాలు తప్పడంలేదు.

గిరిపుత్రుల కష్టాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వానొస్తే ఏజెన్సీ వాసులకు కష్టాలు తప్పడంలేదు. అనారోగ్యం వస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. అష్టకష్టాలు పడితేనేకానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. డోలీ, జెట్టీలపై ఆస్పత్రులకు వాగులు, వంకలు దాటుకుని తీసుకువెళ్లాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే జరిగింది. 


చర్లమండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన తిమ్మిరిగూడెంకు చెందిన సింగయ్య అనే గిరిజనుడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను జెట్టీపై పడుకోబెట్టి గ్రామస్తులు చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మోసుకువెళ్లారు. వాగులు, వంకలు దాటుకుంటూ సుమారు 4 కి.మీ. మోసుకెళ్లారు. అంజనాపురం వరకు రాగానే అక్కడ 108 అంబులెన్స్‌లో చర్ల ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్స చేయగా సింగయ్య ఆరోగ్యం మెరుగుపడింది.

Updated Date - 2020-08-14T19:34:42+05:30 IST