అవకతవకలపై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2021-08-03T06:56:29+05:30 IST

ఏపీపీఎస్‌ నిర్వహించిన బీట్‌ ఆఫీసర్స్‌/ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఎంపిక విధానంలో జరిగిన అవకతవకలపై సమ గ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పలువురు ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు.

అవకతవకలపై విచారణ జరిపించాలి

విజయవాడ సిటీ, ఆగస్టు 2 : ఏపీపీఎస్‌ నిర్వహించిన బీట్‌ ఆఫీసర్స్‌/ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఎంపిక విధానంలో జరిగిన అవకతవకలపై సమ గ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పలువురు ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ 10నిమిషాల పాటు ఆన్‌ లైన్‌లో మెరిట్‌లిస్ట్‌ కనపడకుండా ఎందుకు ఆపారో తెలపాలని డిమాండ్‌ చే శారు. అర్హులైన గిరిజన నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశా రని ఆవేదన వ్యక్తం చేశారు. పి.దుర్గప్రసాద్‌, పి.రాజ్‌కుమార్‌, టి.దుర్గాదేవి, రేనరజిత, బాగ్య, మధుప్రియ, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:56:29+05:30 IST