బాల్క సుమన్‌కు సన్మానం

ABN , First Publish Date - 2022-01-28T05:40:11+05:30 IST

చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ టీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా గురువారం చెన్నూరు పట్టణ కౌన్సిలర్లు, నాయకులు బాల్క సుమన్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

బాల్క సుమన్‌కు సన్మానం
విప్‌ బాల్క సుమన్‌ను సన్మానిస్తున్న కౌన్సిలర్లు, నాయకులు

చెన్నూరు, జనవరి 27 : చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ టీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా  గురువారం  చెన్నూరు పట్టణ కౌన్సిలర్లు, నాయకులు బాల్క సుమన్‌ను శాలువాలతో ఘనంగా  సన్మానించారు.  ఈ సందర్భంగా పలువురుగు పుష్పగుచ్ఛాలు అందజేశారు.

మందమర్రి:  ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో గురువారం  క్యాతన్‌పల్లి టీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు, పాలకవర్గ సభ్యులు, యువనాయకులు పాల్గొన్నారు. 

మందమర్రిటౌన్‌: బాల్క సుమన్‌ను గురువారం పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు హైద్రాబాద్‌కు వెళ్లి కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అద్యక్షుడు రావికంటి వెంకటేశం , నాయకులు పాల్గొన్నారు. అలాగే మందమర్రి టీఆర్‌ఎస్‌ నాయకులు 30 వాహనాల్లో హైద్రాబాద్‌కు వెళ్లి విప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మేడిపల్లి సంపత్‌, జె. రవీందర్‌, బడికెల సంపత్‌, బండారి సూరిబాబు, బట్టు రాజ్‌కుమార్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రిరూరల్‌: బాల్క సుమన్‌ను గురువారం ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌ దంపతులు సుమన్‌ను హైద్రాబాద్‌లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విప్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.

దండేపల్లి:  బాల్క సుమన్‌ను గురువారం మండల టీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, నాయకులు ఆకుల రాజేందర్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

భీమారం: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ టీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో మండలంలోని సర్పంచులు గద్దె రాంరెడ్డి, సంతోషం భాస్కర్‌రెడ్డిలతో పాటు నాయకులు రాజ్‌కుమార్‌, మణిదీప్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భుక్య రాజ్‌కుమార్‌, దాసరి మధునయ్యలు గురువారం హైద్రాబాద్‌లో బాల్క సుమన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  రాజ్‌కుమార్‌నాయక్‌, తిరుపతి, నాయకులు వెళ్లారు. 


Updated Date - 2022-01-28T05:40:11+05:30 IST