ఎమ్మెల్సీ దండె విఠల్కు సన్మానం
ABN , First Publish Date - 2022-01-27T05:51:50+05:30 IST
గణతంత్ర వేడులక సందర్భంగా బుధవారం జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ దండె విఠల్ను ఆసిఫాబాద్ జడ్పీటీసీ నాగేశ్వర్రావు నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 26: గణతంత్ర వేడులక సందర్భంగా బుధవారం జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ దండె విఠల్ను ఆసిఫాబాద్ జడ్పీటీసీ నాగేశ్వర్రావు నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, నాయకులు శ్రీనివాస్, రమేష్, అమానుల్లా పర్వేజ్, సాబీర్ అలీ, నిసార్, వెంకన్న, అహ్మద్, నజీర్, కాపు సంఘం నాయకులు సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.