సూదిని జైపాల్‌రెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-01-17T04:41:15+05:30 IST

సూదిని జైపాల్‌రెడ్డికి ఘన నివాళి

సూదిని జైపాల్‌రెడ్డికి ఘన నివాళి
జైపాల్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌స్‌గౌడ్‌, శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు

  • ఆమనగల్లు, కడ్తాలలో ఘనంగా జైపాల్‌రెడ్డి జయంతి 
  • పెద్దఎత్తున పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు

ఆమనగల్లు/కడ్తాల్‌/మాడ్గుల: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు గ్రహీత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డి 79వ జయంతి వేడుకలు శనివారం ఆమనగల్లు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ సభ్యుడు ఆయిల్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీపాతి శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బిక్య నాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా దేశానికి, ఎమ్మెల్యేగా కల్వకుర్తి నియోజకవర్గానికి అందించిన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధావ ధనుంజయ, ఖలీల్‌, కృష్ణనాయక్‌, వస్పుల శ్రీశైలం, రాఘవేందర్‌, అలీం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రంలో  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు  యాట నర్సింహ ఆధ్వర్యంలో జైపాల్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక  బస్టాండ్‌ కూడలిలో జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడురు శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ పాలకుర్ల ఉమావతి బుగ్గయ్య గౌడ్‌, అద్దాల రాములు, జహంగీర్‌ బాబా, నాయకులు పాల్గొన్నారు. అన్మా్‌సపల్లి గ్రామంలో సర్పంచ్‌ శంకర్‌ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు జలవిహార్‌లోని జైపాల్‌రెడ్డి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌,  కాంగ్రెస్‌ జిల్లా నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, సూదిని రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాడ్గుల మండలంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో రేవంత్‌ మిత్ర మండలి ఆధ్వర్యంలో జైపాల్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ పులికంటి లక్ష్మమ్మ ఆధ్వర్యంలో జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అనంత పద్మనాభరెడ్డి, దేవయ్యగౌడ్‌, మిద్దే రాములు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T04:41:15+05:30 IST