శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి నివాళి
ABN , First Publish Date - 2021-06-24T04:38:56+05:30 IST
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు. సూళ్లూరుపేటలో బుధవారం ముఖర్జీ వర్థంతిని నిర్వహించారు.
సూళ్లూరుపేట, జూన్ 23 : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు. సూళ్లూరుపేటలో బుధవారం ముఖర్జీ వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరణి విజయభాస్కర్రెడ్డి, సీనియర్ నేత ఇమ్మానేని చెన్నకేశవరావు, బెజవాడ విజయమ్మ, తాటిపర్తి ఆదినారాయణ, తన్నీరు శేషగిరిరావు, కిషన్రెడ్డి, కోటయ్య, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.