టీడీపీ నాయకుడు అశోక్‌కుమార్‌కు నివాళి

ABN , First Publish Date - 2021-06-17T05:15:45+05:30 IST

టీడీపీ కన్వీనర్‌ కె.అశోక్‌కుమార్‌కు నాయకులు బుధవారం నివాళి అర్పించారు.

టీడీపీ నాయకుడు అశోక్‌కుమార్‌కు నివాళి
నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌



బేతంచెర్ల, జూన్‌ 16: టీడీపీ కన్వీనర్‌ కె.అశోక్‌కుమార్‌కు నాయకులు బుధవారం నివాళి అర్పించారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, రాష్ట్ర గొర్రెల పెంపకం చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, డోన్‌ మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌, ధర్మవరం సుబ్బారెడ్డి, మండల నాయకులు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, పోలూరు రాఘవరెడ్డి, అడ్వకేట్‌ హరినాథ్‌చౌదరి, ఎల్ల నాగయ్య, తిరుమలేష్‌ చౌదరి, షేక్షావలి చౌదరి అశోక్‌కుమార్‌ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అశోక్‌కుమార్‌ తల్లి ప్రభావతమ్మ, భార్య స్వప్న, కుమారుడు జశ్వంత్‌, కుమార్తె జాహ్నవిలను పరామర్శించి ధైర్యం చెప్పారు. 


ఫోన్‌లో పరామర్శించిన నారా చంద్రబాబు, లోకేష్‌ 


టీడీపీ బలోపేతానికి కృషి చేసిన అశోక్‌కుమార్‌ మృతి పార్టీకి తీరని లోటు అని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అశోక్‌కుమార్‌ తల్లి ప్రభావతమ్మ, భార్య స్వప్నను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు.


Updated Date - 2021-06-17T05:15:45+05:30 IST