శ్యామప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ నేతల నివాళి

ABN , First Publish Date - 2021-06-24T05:36:18+05:30 IST

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతలు బుధవారం మండలంలోని కొత్తపాడేరు, నేరోడివలస గ్రామాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

శ్యామప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ నేతల నివాళి
పాడేరు మండలం నేరోడివలసలో శ్యామప్రసాద్‌ ముఖర్జీకు నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు

ఘనంగా జనసంఘ్‌ వ్యవస్థాపకుని వర్ధంతి



పాడేరు, జూన్‌ 23: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతలు బుధవారం మండలంలోని కొత్తపాడేరు, నేరోడివలస గ్రామాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు, బీజేపీ అరకు జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు, నాయకులు కురసా రాజారావు, సల్లా రామకృష్ణ, నందోలి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.


కొయ్యూరు: మండలంలోని బాలారం, రత్నంపేట, తదితర గ్రామాల్లో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు, అరకు జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శి అరిమెల రాజు, నాయకులు మచ్చల మంగతల్లి, దూరి కిరణ్‌ సాగర్‌, తీగల అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


ముంచంగిపుట్టు: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాఘవేంద్ర, మండల నాయకులు ఆర్‌.మత్స్యరాజు, వి.లక్ష్మణ్‌, కె.సుబ్బారావు, వి.కర్రిబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T05:36:18+05:30 IST