త్రిపుర టీటీఏఏడీసీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం
ABN , First Publish Date - 2021-04-11T03:05:24+05:30 IST
త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలింది.
అగర్తల: త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలింది. శనివారం జరిగిన ఎన్నికల్లో కొత్తగా పురుడు పోసుకున్న తిప్రాహా ఇండిజెనియస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయెన్స్ (టీఐపీఆర్ఏ) మోతా ఘన విజయం సాధించింది. రాజవంశీకుడు ప్రద్యోత్ కిశోర్ దేబ్బర్మ ఈ రాజకీయ సంస్థను స్థాపించారు.
మొత్తం 28 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఐపీఆర్ఏ 18 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 9 స్థానాలతో సరిపెట్టుకోగా, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థి ఒక్క స్థానంలో గెలుపొందాడు. కౌన్సిల్లో మొత్తం 30 స్థానాలు ఉండగా 28 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాలకు గవర్నర్ నామినేట్ చేస్తారు. కాగా, ఫలితాలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.