టీఎంసీ నాయకులపై తాలిబన్ల స్టైల్లో దాడి చేయండి: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-08-20T01:42:59+05:30 IST

టీఎంసీ నాయకులు అగర్తలా ఎయిర్‌పోర్టులో కాలుపెడితే వారిపై తాలిబన్ల స్టైల్లో దాడి చేయాలని త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ చంద్ర భౌమిక్ ఇటీవల తన మద్దతుదారులకు సూచించారు.

టీఎంసీ నాయకులపై తాలిబన్ల స్టైల్లో దాడి చేయండి: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య

అగర్తలా: టీఎంసీ నాయకులు అగర్తలా ఎయిర్‌పోర్టులో కాలుపెడితే వారిపై తాలిబన్ల స్టైల్లో దాడి చేయాలని త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ చంద్ర భౌమిక్ ఇటీవల తన మద్దతుదారులకు సూచించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెచ్చగొట్టడంతో టీఎంసీ నాయకులు త్రిపురలో బిజేపీ ప్రభుత్వానికి నష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చివరి రక్తపుచుక్క వరకూ తాము బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు. కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన మంత్రి ప్రతిమా భౌమిక్ కోసం బుధవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మల్యే అరుణ్ చంద్ర ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. 

Updated Date - 2021-08-20T01:42:59+05:30 IST