త్రివేది ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2021-05-17T06:08:19+05:30 IST

సమాజ సేవకు భాష్యం చెప్పిన వల్లభనేని త్రివేది ఆశయాలను అమలు చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పలువురు గ్రామ ప్రము ఖులు పేర్కొన్నారు.

త్రివేది ఆశయ సాధనకు కృషి
సంస్మరణ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వక్తల నివాళి

హనుమాన్‌ జంక్షన్‌, మే 16 : సమాజ సేవకు భాష్యం చెప్పిన వల్లభనేని  త్రివేది  ఆశయాలను అమలు చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పలువురు గ్రామ ప్రము ఖులు పేర్కొన్నారు.  డీసీసీ మాజీ ఉపాధ్య క్షుడు, లయన్స్‌ క్లబ్‌ మాజీఅధ్యక్షుడు వల్లభనేని త్రివేది సంస్మరణ కార్యక్రమం ఆదివారం ఆయన నివాసంలో  జరిగింది. పలువురు ప్రముఖులు త్రివేది చిత్రపటం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  త్రివేది కుమారుడు రాజేష్‌ మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు.  ఆయన పేరుతో  విస్తృత సేవా కార్యక్రమాలు చేపడ తామన్నారు. అనంతరం ఆశాజ్యోతి దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు అన్నదానం చేశారు.  మాజీ జడ్పీటీసీ సభ్యులు సుంకర సుభాష్‌ చంద్రబోస్‌, చలసాని వెంకటేశ్వరరావు, కాకరాల రాజేంద్ర ప్రసాద్‌, వేగిరెడ్డి బాలాజీ, మిక్కిలినేని అప్పారావు, అక్కినేని రాఘవేంద్రరావు, కుటుంబ సభ్యులు గొట్టుముక్కల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T06:08:19+05:30 IST