ఓ మహిళకు తీవ్ర జ్వరం.. రోజులు గడుస్తున్నా తగ్గడం లేదని ఒకేసారి 8 మాత్రలు మింగేసిందామె.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-18T20:21:23+05:30 IST

35 సంవత్సరాల వయసు కలిగిన ఆ మహిళ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.

ఓ మహిళకు తీవ్ర జ్వరం.. రోజులు గడుస్తున్నా తగ్గడం లేదని ఒకేసారి 8 మాత్రలు మింగేసిందామె.. ఆ తర్వాత..

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఆ మహిళ పేరు సారిక. 35 సంవత్సరాల వయసు కలిగిన ఆ మహిళ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎన్ని మాత్రలు వేసుకుంటున్నా తగ్గడం లేదు. బుధవారం రాత్రి జ్వరానికి తలనొప్పి కూడా తోడైంది. జ్వరంతో పాటు తలనొప్పి కూడా రావడంతో తట్టుకోలేకపోయిన సారిక ఒకేసారి ఎనిమిది తలొనొప్పి మాత్రలు మింగేసింది. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. 


దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన వైద్యులు ఆమెను సమీపంలోని పెద్దాసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమెను హాస్పిటల్‌లో చేర్చుకునే సమయంలో సిబ్బంది స్థానిక రామ్‌గఢ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రస్తుతం కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

Updated Date - 2021-11-18T20:21:23+05:30 IST