దేశంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-10-28T04:13:31+05:30 IST

దేశంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

దేశంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌
ఆమనగల్లు : టీఆర్‌ఎ్‌్‌సలో చేరిన నాయకులతో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

  • ఎంపీ రాములు , ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌


ఆమనగల్లు: దేశంలో టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ సాటి రాదని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కు తిరుగు లేదని నాగర్‌కర్నూల్‌ పంపీ పోతుగంటి రాములు అన్నారు. కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ నియోజకవర్గస్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అధ్యక్షతన బుధవారం తోడేటి అశోక్‌ రెడ్డి గార్డెన్‌లో నిర్వహించారు. సమావేశానికి ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి, కల్వకుర్తి, వెల్దండ మండలాల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి ఎంపీ రాములు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ గర్జన సభ విజయవంతంగురించి సమావేశంలో చర్చించారు. టీఆర్‌ఎ్‌స్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రతి గ్రామం నుంచి సభకు వందలాదిగా తరలి రావాలని రాములు పిలుపు నిచ్చారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకు టీఆర్‌ఎస్‌ ఆదర్శంగా నిలుస్తుందని, , రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు టీఆర్‌ఎస్‌ దే అధికారమని ఎంపీ రాములు పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ , మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి వైస్‌ చైర్మన్‌ తోట గిరియాదవ్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మున్సిఫల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం,  రాష్ట్ర స ర్పంచ్‌ ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పోనుగోటి అర్జున్‌ రావు, శంకర్‌, జైపాల్‌ రెడ్డి, కంబాల పరమేశ్‌, భూపతి రెడ్డి, విజయ్‌గౌడ్‌, జడ్పీటీసీ లు అనురాధ, దశరథ్‌ నాయక్‌ః, విజితారెడ్డి, పోతుగంటి భరత్‌, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు 

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఆయన చెప్పారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ మహేశ్‌ గౌడ్‌, పలువురు బీజేపీ నాయకులు బుధవారం ఆమనగల్లు వైస్‌ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌స్‌ పార్టీలో చేరారు. నాయకులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా రంజక పాలన సాగిస్తుందన్నారు. 

విజయగర్జన సభను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే అంజయ్య

షాద్‌నగర్‌రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతి కార్యకర్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. నవంబరు 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభ సన్నాహక సమావేశం బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్‌ సభ విజయవంతానికి అందరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్‌ విండో చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:13:31+05:30 IST