టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తులు: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T20:26:09+05:30 IST

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తులని, గల్లీలో మాత్రమే శత్రువులని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తులు: ఎంపీ కోమటిరెడ్డి

నల్గొండ: టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తులని, గల్లీలో మాత్రమే శత్రువులని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ను జైల్లో పెట్టించాలని పేర్కొన్నారు.


రాష్ట్రానికి కేటాయించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. ఐటీఐఆర్‌పై కేసీఆర్‌, కేటీఆర్‌ ఇంతవరకు కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి  ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు చెందిన ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ వివక్ష చూపెడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి   విమర్శించారు.

Updated Date - 2021-01-27T20:26:09+05:30 IST