ఎంపీ అరవింద్ పర్యటనలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-12-27T03:07:15+05:30 IST
ఎంపీ అరవింద్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారంలో పల్లె ప్రకృతి వనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు...
నిజామాబాద్: ఎంపీ అరవింద్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారంలో పల్లె ప్రకృతి వనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి ఏర్పాట్లను చేశారు. ఎంపీ అరవింద్ రాకముందే టీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేయడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ నేతలు ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎంపీ అరవింద్ కాన్వాయ్ అడ్డుకోవడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, బీజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెద్దరగోట్టారు. చివరకు ఎంపీ అరవింద్ సర్పంచ్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.