కుల సంఘాల పేరుతో నిరసనకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల యత్నం: బీజేపీ

ABN , First Publish Date - 2020-08-09T09:08:15+05:30 IST

కుల సంఘాల పేరుతో కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ప్రేమ్‌రాజ్‌ యాదవ్‌ ఆరోపించారు...

కుల సంఘాల పేరుతో నిరసనకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల యత్నం: బీజేపీ

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కుల సంఘాల పేరుతో కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ప్రేమ్‌రాజ్‌ యాదవ్‌ ఆరోపించారు. పదవులు ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ అంతర్గత విషయమని ఆయన స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ బీజేపీ కమిటీ ఇంకా పూర్తికాలేదని, రాబోయే పదవుల్లో అందరికీ సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర కమిటీలో యాదవులకు అవకాశం కల్పించలేదంటూ కొంతమంది యువకులు శనివారం నాంపల్లిలో బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.


Updated Date - 2020-08-09T09:08:15+05:30 IST