టీఆర్‌ఎస్‌ గుండాగిరి చేస్తోంది: ఈటల

ABN , First Publish Date - 2021-07-19T18:08:30+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుండాగిరి చేస్తోందని మాజీమంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం

టీఆర్‌ఎస్‌ గుండాగిరి చేస్తోంది: ఈటల

హుజురాబాద్: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుండాగిరి చేస్తోందని మాజీమంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ఈటల పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతి తీసుకున్నా అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారని, ఓడిపోతామన్న భయంతో టీఆర్‌ఎస్‌ గుండాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నీచ సంస్కృతికి ఈ పరిణామాలు అద్దం పడతాయని హెచ్చరించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఇక్కడి నుంచే చరమగీతం పాడుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 


హుజూరాబాద్ నియోజకవర్గంలో 23 రోజులపాటు ఈటల పాదయాత్ర నిర్వహించనున్నారు. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్ల దూరం ఈటల పాదయాత్ర చేయనున్నారు. తొలిరోజు శనిగరం, మాదన్న పేట, గునిపర్తి , శ్రీరాముల పేట, అంబలలో పాదయాత్ర నిర్వహించనున్నారు.

Updated Date - 2021-07-19T18:08:30+05:30 IST