Mahatma మన్నించు.. గాంధీ విగ్రహం చుట్టూ TRS తోరణాలు
ABN , First Publish Date - 2021-10-25T16:08:31+05:30 IST
సోమవారం జరిగే ప్లీనరీని పురస్కరించుకొని నగరాన్ని గులాబిమయం..
హైదరాబాద్ సిటీ/రాంగోపాల్పేట్ : సోమవారం జరిగే ప్లీనరీని పురస్కరించుకొని నగరాన్ని గులాబిమయం చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహాన్ని టీఆర్ఎస్ తోరణాలతో నింపేశారు. గాంధీ విగ్రహానికి పార్టీ పతాకాలు కట్టడం ఆయనను అవమానించడమేనని స్థానికులు అంటున్నారు. రాజకీయ నాయకులు చేసిన పనుల వల్ల తమను క్షమించు మహాత్మా అని అంటున్నారు.