TRS సభా స్థలికోసం పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-11-06T17:54:15+05:30 IST

దేవన్నపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. టీఆర్ఎస్ సభా స్థలికోసం పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. మరోవైపు అధికారుల అండతో గులాబీ గ్యాంగ్

TRS సభా స్థలికోసం పోలీసుల అత్యుత్సాహం

హన్మకొండ: దేవన్నపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. టీఆర్ఎస్ సభా స్థలికోసం పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. మరోవైపు అధికారుల అండతో గులాబీ గ్యాంగ్ సభా స్థలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించాలని భావించారు. అయితే.. రైతులు పెద్దమొత్తంలో రావడంతో ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరుకాలేదు. సభాస్థలి నుంచి వెళ్లి పోవాలంటూ..మహిళలతో హసన్ పర్తి సీఐ శ్రీధర్ రావు దురుసుగా ప్రవర్తించాడు. భూమి పత్రాలు తీసుకురావాలని, ఈ భూమి మీ జాగీరా అంటూ.. నోటికి ఎంతవస్తే అంత మాట్లాడటంతో..పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. 

Updated Date - 2021-11-06T17:54:15+05:30 IST