HYD : చిన్న వివాదంలో జోక్యం.. మధ్యలో దూరిన టీఆర్ఎస్ నేత.. మహిళను నెట్టేయడంతో..
ABN , First Publish Date - 2021-08-03T14:02:30+05:30 IST
చిన్నవివాదం... మధ్యలో టీఆర్ఎస్ నేత వెళ్లాడు. ఘర్షణ తలెత్తడంతో
- వ్యక్తిపై టీఆర్ఎస్ నేత దాడి
- బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు.. అరెస్ట్
హైదరాబాద్ సిటీ/బేగంపేట : చిన్నవివాదం... మధ్యలో టీఆర్ఎస్ నేత వెళ్లాడు. ఘర్షణ తలెత్తడంతో తన అనుచరులతో అవతలి వ్యక్తిపై టీఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతడి భార్యనూ నెట్టి వేయడంతో అమె కింద పడి గాయాలకు గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు టీఆర్ఎస్ నాయకుడు, అతడి అనుచరులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్లో ఆదివారం రాత్రి స్వల్ప విషయంపై భుకియా యూకు, ఓజయ అనే ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో ఓజయాకి మద్దతుగా ఇదే ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కేవీఆర్ రాజు తన మిత్రుడు రమే్షతో కలిసి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి భుకియా యూకుపై దాడి చేయడంతో స్వల్ప గాయాలు అయి ఆయన చొక్కా చిరిగిపోయింది. అడ్డు వచ్చిన అతడి భార్యనూ నెట్టి వేయడంతో ఆమె కింద పడింది. వీరి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేవీఆర్ రాజు, రమేష్, ఓజయపై పోలీసులు 324, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.