టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పెంపుడు కుక్కలకు ఉన్న విలువ లేదు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-05-28T21:18:19+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పెంపుడు కుక్కలకు ఉన్న విలువ లేదని, ప్రశ్నిస్తే మళ్లీ టికెట్‌ రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భయపడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎద్దేవాచేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పెంపుడు కుక్కలకు ఉన్న విలువ లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పెంపుడు కుక్కలకు ఉన్న విలువ లేదని, ప్రశ్నిస్తే మళ్లీ టికెట్‌ రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భయపడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ దొరకని రాష్ట్రం మనదన్నారు. సంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదని, మంజీరాకు వచ్చే నీళ్లను మంత్రి హరీశ్‌రావు తరలించుకుపోయారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లతో మంజీరా నింపుతామన్నారని, మూడేళ్లయినా రాలేదని దుయ్యబట్టారు. హరీశ్‌రావు సంగతేంటో సంగారెడ్డిలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. జాన్ 4న తమ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంజీరా డ్యామ్‌ను సందర్శిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.

Updated Date - 2020-05-28T21:18:19+05:30 IST