కేసీఆర్ ఇజంను ప్రజల్లోకి తీసుకెళ్తా: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
ABN , First Publish Date - 2022-01-28T21:49:55+05:30 IST
సీఎం కేసీఆర్ ఇజంను ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే
హనుమకొండ: సీఎం కేసీఆర్ ఇజంను ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదని ఇచ్చిన కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ బండారాన్ని బయటపెడతామని ఆయన హెచ్చరించారు. దేశం కేసీఆర్ వైపు చూస్తోందని, ఓర్వలేక బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ బండారాన్ని బయటపెడతామన్నారు. బీజేపీ విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్ట హామీలను కేంద్రం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి వరంగల్కు టూరిస్టు మంత్రిగా కాదు టూరిస్టుగా వచ్చి వెళ్లాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ను టచ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.