కవితకు ఘన స్వాగతం.. గజమాలతో సత్కారం

ABN , First Publish Date - 2021-03-01T23:56:31+05:30 IST

కవితకు ఘన స్వాగతం.. గజమాలతో సత్కారం

కవితకు ఘన స్వాగతం.. గజమాలతో సత్కారం

నిజామాబాద్: జన్నేపల్లిలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. కవిత రోడ్ షోలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కవితను గజమాలతో సత్కరించారు. జన్నేపల్లిలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో శివాలయం ఆధునీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవితకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ పర్యటకు వెళ్తున్న కవితకు మేడ్చల్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి  హన్మంతరావు, నక్కా ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, గిరిజన నృత్యాలతో ఘనంగా ఆహ్వానించారు.


అటు మెదక్ జిల్లాలోనూ అడుగడుగునా మైనంపల్లి అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు  ఘన స్వాగతం పలికారు. మనోహరాబాద్ మండలం కళాకల్ వద్ద టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్, చేగుంట, రామాయంపేట వరకు యాభై కిలో మీటర్ల మేర శాలువాలతో ఆమెను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు 300ల కార్లతో ర్యాలీ కొనసాగింది. మాదవ్‌నగర్ వద్ద 400 కిలోల గజమాలతో కవితను సత్కరించారు. 

Updated Date - 2021-03-01T23:56:31+05:30 IST