ఢిల్లీలో బీజేపీ ధర్నాలు చేయాలి: ఎమ్మెల్సీ పల్లా

ABN , First Publish Date - 2021-11-11T21:43:57+05:30 IST

ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్రంలో కాదు.. ఢిల్లీలో

ఢిల్లీలో బీజేపీ ధర్నాలు చేయాలి: ఎమ్మెల్సీ పల్లా

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్రంలో కాదు.. ఢిల్లీలో బీజేపీ ధర్నాలు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఎన్నిఅడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రంలో నిరంతరం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనుసాగుతోందన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని పల్లా తెలిపారు. ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రాలకు కేంద్రం బియ్యం సరఫరా చేయాలని పల్లా డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఇప్పటికే 3,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెయ్యి కోట్లకు పైగా విలువైన ధాన్యం కొనుగోలు చేశారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-11T21:43:57+05:30 IST