సంజయ్కి ఎంపీల విలువ తెలియదు: ఎంపీ వెంకటేష్
ABN , First Publish Date - 2021-12-03T02:41:48+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కి ఎంపీల
ఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కి ఎంపీల విలువ తెలియదని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ అన్నారు. తెలంగాణ రైతులను బండి సంజయ్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఎంపీలను పట్టుకుని దొంగలు గజ దొంగలు అంటారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఉన్నవారంతా దొంగలు, గజ దొంగలా అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్, ఎంపీలందరికీ సంజయ్ క్షమాపణలు చెప్పాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలను గజ దొంగలుగా బండి సంజయ్ అభివర్ణించారు.