గ్రేటర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-15T17:46:57+05:30 IST

గ్రేటర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో ప్రారంభమైంది.

గ్రేటర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం ప్రారంభం

హైదరాబాద్:  గ్రేటర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో ప్రారంభమైంది. ఈనెల 18న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవలే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ ముట్టడించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు గట్టి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు తలసాని, మహుమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి,  జీహెచ్ఎంసీ మేయర్ హాజరయ్యారు. 

Updated Date - 2021-12-15T17:46:57+05:30 IST