ఓట్ల కోసమే టీఆర్ఎస్ ఆరాటం: విజయశాంతి
ABN , First Publish Date - 2021-03-12T22:24:28+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఇచ్చిన
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తప్పుబట్టారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కు మద్దతిస్తారంటా అని ప్రశ్నించారు. నిజాం షుగర్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ ప్రస్తావనే లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే టీఆర్ఎస్ ఆరాటమని విమర్శించారు. ‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ టీఆర్ఎస్ నేతలు సరిగ్గా ఈ సమేతలాగే వ్యవహరిస్తున్నారని విజయశాంతి ద్వజమెత్తారు.