పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను బలపర్చిన టీఆర్ఎస్ నేతలు

ABN , First Publish Date - 2021-10-17T19:33:49+05:30 IST

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రులు బలపరిచారు.

పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను బలపర్చిన టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రులు బలపరిచారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరుపున ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ, మల్లారెడ్డి, అల్లోల, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినవారిలో ఉన్నారు.

Updated Date - 2021-10-17T19:33:49+05:30 IST