ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ
ABN , First Publish Date - 2021-09-01T21:45:52+05:30 IST
గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్లో
హైదరాబాద్: గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. ఎంపీలకు అనుగుణంగా స్థలం కేటాయింపు జరిగింది. భూమి పూజ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి సహా పలువురు ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. భూమి పూజ ఏర్పాట్లను కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు పర్యవేక్షించారు.