టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-24T19:58:29+05:30 IST

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ ప్రతినిధులతోపాటు మొత్తం ఆరువేల మంది ప్లీనరీకి రానున్నారు. పార్లమెంట్ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్లపాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. పదోసారి కూడా కేసీఆర్‌ను పార్టీ అద్యక్షుడిగా ఎన్నుకోవడం లాంఛనం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం గులాబీ మయం అయింది. హైదరాబాద్‌లోని ప్రధాన సెంటర్లలో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, సంక్షేమ పథకాలను వివిరించే ప్లెక్సీలు వెలిశాయి.

Updated Date - 2021-10-24T19:58:29+05:30 IST