టీఆర్ఎస్ విజయగర్జన సభకు తరలిరావాలి
ABN , First Publish Date - 2021-10-23T04:39:52+05:30 IST
టీఆర్ఎస్ విజయగర్జన సభకు ప్రతి ఒక్క కార్యకర్త హాజరుకావాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పలు మండలాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
జిన్నారం/జహీరాబాద్/టేక్మాల్/వట్పల్లి/మునిపల్లి/గుమ్మడిదల, అక్టోబరు 22 : టీఆర్ఎస్ విజయగర్జన సభకు ప్రతి ఒక్క కార్యకర్త హాజరుకావాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో టీఆర్ఎస్ మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబరు 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈనెల 25న హైదరాబాద్లో నిర్వహించే ప్లీనరీకి నియోజకవర్గం నుంచి 50 మంది ప్రతినిధులతో హాజరుకానున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం వద్ద వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ, విజయగర్జన సభ ఏర్పాట్లపై గుమ్మడిదల మండల కేంద్రంలోని చంద్రారెడ్డి గార్డెన్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండి.హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ వచ్చేనెల 15న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభకు తరలిరావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, సీనియర్ నాయకులు చిమ్ముల గోవర్ధన్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు పద్మ కొండల్రెడ్డి, రాజలక్ష్మి వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 21 మందికి కల్యాణలక్ష్మి పథకాలను అందజేశారు. నవంబరు 15న వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ విజయగర్జన మహాసభకు ప్రతీ కార్యకర్త హాజరుకావాలని టీఆర్ఎస్ జహీరాబాద్ మండలాధ్యక్షుడు ఎంజి.రాములు పిలుపునిచ్చారు. జహీరాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ మండల నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, తాజొద్దీన్, మచ్చేందర్, విజయ్, రాజు పాల్గొన్నారు. వరంగల్లో 15న నిర్వహించే విజయగర్జన మహాసభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ టేక్మాల్ మండలాధ్యక్షుడు వీరప్ప అన్నారు. టేక్మాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు యూసుఫ్, ప్రధాన కార్యదర్శి అవినా్షకుమార్, రైతుస మన్వయ సమితి అధ్యక్షుడు శ్రీధరాచార, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరంచ సాయిలు, మాజీ ఎంపీటీసీ సిద్ధన్న, పులి సత్యం, భాస్కర్ పాల్గొన్నారు. 25న పార్టీ ప్లీనరీ, నవంబరు 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభకు కార్యకర్తలు తరలిరావాలని పార్టీ మండలాధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి శివాజీరావు అన్నారు. వట్పల్లి మండలంలో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ రజనీకాంత్, వరం చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ కృష్ణవేణి, వైస్ ఎంపీపీ నాగరాణి, జడ్పీటీసీ అపర్ణ పాల్గొన్నారు. వరంగల్లో జరిగే విజయగర్జన సభకు మండలం నుంచి వేలాదిగా తరలిరావాలని జడ్పీటీసీ మీనాక్షి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీ్షకుమార్ అన్నారు. శుక్రవారం మునిపల్లి మండలంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నాయకులు సాయికుమార్, సతీ్షకుమార్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.