టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పండి

ABN , First Publish Date - 2021-04-14T06:31:18+05:30 IST

ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్న అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రె ్‌సకు ఉప ఎన్నికలో బుద్ధిచెప్పాలని బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పండి
ఎల్లాపురంతండాలో మాట్లాడుతున్న బీజేపీ అభ్యర్ధి రవినాయక్‌

బీజేపీ అభ్యర్థి రవికుమార్‌ 

తిరుమలగిరి(సాగర్‌), ఏప్రిల్‌ 13: ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్న అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రె ్‌సకు ఉప ఎన్నికలో బుద్ధిచెప్పాలని బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ అన్నారు. మండలంలోని చిలుకాపురం, ఎల్లాపురం, ఎల్లాపురంతండా, అల్వాలతండా, అల్వాల, శ్రీరాంపల్లి తదితర గ్రా మాల్లో మంగళవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడా రు. సీఎం కేసీఆర్‌ మాయమాటలు చెప్పి అధికారంచేపట్టి ఏడేళ్లయి నా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, ఒకే దఫాలో రుణమాఫీ, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు వంటి హామీలను గాలికి వదిలేశారని అన్నారు. జాతీయపార్టీ అయిన బీజేపీ గిరిజనుడైన తనకు జనరల్‌ కోటాలో సీటు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. అన్నివర్గాల ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. 35 ఏళ్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి చేసిన అభివృద్ధి తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ కొంపల్లి శ్రీనివాస్‌, ఎర్ర మహేశ్వర్‌, నగేష్‌, విజయ్‌, సక్రు, శ్రీను, రాంబాబు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T06:31:18+05:30 IST