టీఆర్ఎస్ అధికార మదంతో దుష్టపాలన చేస్తోంది: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-04-09T21:36:06+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికార మదంతో దుష్టపాలన చేస్తోందని దుయ్యబట్టారు. మంత్రి మల్లారెడ్డి లంచాలు వసూల్ చేసే పనిలో పడ్డారని, లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు అందులో ఏమైనా వాటాలు వస్తున్నాయా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. సీఎం జగన్తో కుమ్మక్కయ్యాడు కాబట్టే కేసీఆర్.. సంగమేశ్వరపై నోరు మెదపడం లేదని ఉత్తమ్కుమార్ దుయ్యబట్టారు.