టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే: కవిత
ABN , First Publish Date - 2021-11-28T00:31:49+05:30 IST
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జగిత్యాల: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయాన్ని శనివారం కవిత మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సరైన బలం లేదన్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి పార్టీలో తగిన న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవసరమైన నిధులు, విధులు కేసీఆర్ సర్కారు అందిస్తోందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని కవిత పేర్కొన్నారు.