టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు!

ABN , First Publish Date - 2020-10-24T16:40:18+05:30 IST

ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల నాయకత్వంలోని బృందం దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహి

టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు!

హైదరాబాద్: ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల నాయకత్వంలోని బృందం దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. కాగా.. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలను మంచి ఆదరణ లభిస్తుందని ఎన్నారై నాయకులు మీడియా తెలియజేశారు. తమకు అందుతున్న పథకాల గురించి ప్రజలే వివరిస్తూ.. లక్ష మెజారిటీతో సోలిపేట సుజాతను గెలిపించుకుంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీలో సోలిపేట సుజాత గెలుపొందబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఇంటింటి ప్రచారంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శాసబోయిన, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, శ్రీనివాస్ వల్లాల, స్థానిక నాయకులు బాలకృస్ణ పొగాకు, రాజేష్ భండారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T16:40:18+05:30 IST