నిజమైన రాహుల్‌ జోస్యం

ABN , First Publish Date - 2021-11-20T08:17:57+05:30 IST

సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ ఏడాది జనవరిలో

నిజమైన రాహుల్‌ జోస్యం

న్యూఢిల్లీ, నవంబరు 19: సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ ఏడాది జనవరిలో స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను మోదీ సర్కారు ఉపసంహరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆరోజు తాను చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాని ఆయన పేర్కొన్నారు. నాడు ఆయన చెప్పిన జోస్యం శుక్రవారం నిజమైంది. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీ ప్రకటనపై రాహుల్‌ మరోసారి స్పందించారు. ‘‘దేశ అన్నదాతలు ప్రభుత్వ అహంకారాన్ని నేలమీదకు దించారు. రైతులు తమ సత్యాగ్రహంతో ప్రభుత్వాన్ని ఓడించారు. అన్యాయాన్ని ఓడించిన రైతులకు అభినందనలు. జై హింద్‌, జై హింద్‌ కా కిసాన్‌!’’ అని రాహుల్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు.

Updated Date - 2021-11-20T08:17:57+05:30 IST