బీఎస్పీ అధికారంలోకి రాబోతుంది: ప్రవీణ్‌కుమార్

ABN , First Publish Date - 2021-10-30T02:29:09+05:30 IST

రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి

బీఎస్పీ అధికారంలోకి రాబోతుంది: ప్రవీణ్‌కుమార్

కామారెడ్డి: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. బీఎస్పీ నినాదాలతో దొరల గడికి బీటలు పడుతాయన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్‌ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు బీఎస్పీ కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్‌‌లాగా కల్లిబొల్లి మాటలు తమకు రావని ప్రవీణ్‌కుమార్ అన్నారు. 


Updated Date - 2021-10-30T02:29:09+05:30 IST