సైబర్ ల్యాబ్తో నేరాలకు చెక్
ABN , First Publish Date - 2021-07-17T01:27:43+05:30 IST
మహిళలపై జరుగుతున్న నేరాలకు సైబర్ ల్యాబ్తో చెక్ పెట్టవచ్చని డీజీపీ
హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న నేరాలకు సైబర్ ల్యాబ్తో చెక్ పెట్టవచ్చని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాల కోసం ఈ సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహనకు పోలీస్ స్టేషన్ స్థాయిల్లోనే సైబర్ వారియర్లను నియమించామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.