మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ... డీజీపీ

ABN , First Publish Date - 2021-12-01T23:56:33+05:30 IST

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని డీజీపీ

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ... డీజీపీ

ఖమ్మం: మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. డిసెంబరు 2వ తేదీ నుంచి మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్ష జరిపారు. వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయింది. ఛత్తీస్‌గడ్, ఒడిశా, తెలంగాణ పోలీసులు మూకుమ్మడిగా కూంబింగ్ చేస్తున్నారు. సమీక్ష అనంతరం  ఐటీసీ బీపీఎల్‌లో డీజీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర రాష్ట్ర సరిహద్దు మావోయిస్ట్ ప్రాంతాలలో పర్యటించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఏడాది కాలంగా మావోయిస్టులు చత్తీస్‌ఘడ్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాలన విభాగం, ప్రజల సహకారంతో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా చేస్తామని ఆయన చెప్పారు.




Updated Date - 2021-12-01T23:56:33+05:30 IST