తెలంగాణలో ఎల్లుండి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-02T22:24:45+05:30 IST
తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు. ఎంసెట్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎంసెట్కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ విద్యార్థులు 1,64,678 మంది, మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్న విద్యార్థులు 86,454 మంది రాస్తున్నారని తెలిపారు. ఎంసెట్ కోసం తెలంగాణలో 82 సెంటర్లు, ఏపీలో 23 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆగస్ట్ 4,5,6 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని గోవర్ధన్ చెప్పారు. ఆగస్ట్ 9,10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తామని తెలిపారు. రెండు గంటల ముందే పరీక్ష హాల్ లోకి విద్యార్థులను అనుమతిస్తామని, హాల్ టికెట్తో పాటు రూట్ మ్యాప్ కూడా విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశామని గోవర్ధన్ పేర్కొన్నారు.