కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణం: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-04-30T22:58:59+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో

కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది నుంచి ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచలేక పోయారని తప్పుబట్టారు. సచివాలయం లేకపోవడం వల్ల పాలన కుప్పకూలిందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబితే వినేవారు కరువయ్యారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు కరోనా వస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకున్నారని ఆరోపించారు. పేద ప్రజలు మాత్రం బిల్లులు చెల్లించలేక చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-30T22:58:59+05:30 IST