కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు: తెలంగాణ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-07-20T23:14:05+05:30 IST
రాష్ట్రంలో భూముల వేలంపై వచ్చన కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని
హైదరాబాద్: రాష్ట్రంలో భూముల వేలంపై వచ్చిన కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై పలువురు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని ప్రభుత్వం తెలిపింది. కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన పరువు నష్టం చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.