టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-05-28T13:05:14+05:30 IST
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం కేయూ ఆధ్వర్యంలో నిర్వహించే టీఎస్ ఐసెట్-2020 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జూన్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి ప్రకటించారు. జూలై 13న తెలుగు రాష్ట్రాల్లోని 14 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.