విద్యార్థులకు అండగా నుమాయిష్: మంత్రి మహమూద్
ABN , First Publish Date - 2022-01-01T23:34:11+05:30 IST
రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నుమాయిష్
హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నుమాయిష్ అండగా ఉందని హోంశాఖా మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్-2022ను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహమూద్ అలీ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ఆదాయాన్ని 19 ఎడ్యుకేషనల్ సంస్థలకు ఉపయోగిస్తున్నారన్నారు. ఈ ఆదాయంతో 30 వేల మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల స్టాల్స్ను ఏర్పాటు చేస్తారన్నారు. నుమాయిష్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్ లేకుండా ఎవరూ కూడా ఎగ్జిబిషన్కు రాకూడదన్నారు. మాస్క్ లేకుంటే పోలీసులు ఫైన్ విధిస్తారని ఆయన హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వ్యాపారస్తులు..ఇక్కడ తీసుకోవచ్చని ఆయన తెలిపారు.