ఇంటర్లోనూ సిలబస్ తగ్గింపు!
ABN , First Publish Date - 2020-07-10T08:30:47+05:30 IST
ఇంటర్లోనూ సిలబస్ తగ్గింపు!
హైదరాబాద్, జూలై 9(ఆంధ్రజ్యోతి): సీబీఎ్సఈ 11, 12వ తరగతి సిలబ్సలో 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్ సిలబ్సపైనా విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సబ్జెక్టువారీగా తొలగించాల్సిన పాఠాలపై కసరత్తు ప్రారంభించింది. గతంలో సీబీఎ్సఈ, ఇంటర్ బోర్డు సిలబ్సలు వేర్వేరుగా ఉండగా.. జాతీయస్థాయి ప్రవేశపరీక్షలైన జేఈఈ, నీట్లను దృష్టిలో ఉంచుకుని రెండుచోట్ల దాదాపు ఒకేతరహా సిలబస్ అమల్లో ఉంది. దీంతో ప్రధాన సబ్జెక్టుల్లో సీబీఎ్సఈ తొలగించిన పాఠాలనే తొలగించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.