బద్వేల్‌లోనే కొంచెం నయం!

ABN , First Publish Date - 2021-11-03T09:33:26+05:30 IST

బద్వేల్‌లోనే కొంచెం నయం!

బద్వేల్‌లోనే కొంచెం నయం!

అక్కడ కాంగ్రె్‌సకు పడిన ఓట్లు 6,217.. హుజూరాబాద్‌లో 3,014 ఓట్లే


హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం చేసింది కాంగ్రెస్సేనని ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. మరోవైపు మెజార్టీ ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని విభజించి తమకు అన్యాయం చేసిందని ఆగ్రహిస్తుంటారు. అయితే, తాజా ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కంటే.. ఏపీ ప్రజలే కాంగ్రె్‌సపై కాస్త కనికరం చూపించారు. ఏపీలోని బద్వేల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మకు 6,217 ఓట్లు రాగా.. హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్‌కు అందులో సగం (3,014) కూడా రాలేదు. కాగా, బద్వేల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయకపోవడం, బీజేపీ కూడా బలహీనం కావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆ మేరకు ఓట్లు వచ్చాయన్న వాదన వినిపిస్తోంది.

Updated Date - 2021-11-03T09:33:26+05:30 IST