అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు

ABN , First Publish Date - 2021-11-10T01:13:19+05:30 IST

సినీ నటుడు అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్‌లు పంపింది. అల్లు అర్జున్ నటించిన..

అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు

హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు అధికారులు లీగల్ నోటీస్‌లు పంపారు. అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ. సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని సజ్జనార్ సూచించారు.‌ ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా చాలా మంది ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు.  ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని సజ్జనార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-10T01:13:19+05:30 IST