సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్‌ కృషి

ABN , First Publish Date - 2021-04-14T06:09:33+05:30 IST

తెలం గాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఏర్పడినప్పటి నుంచి ఉపాధ్యాయుల సమ స్యల పరిష్కారంలో ముందుండి పోరాటం చేసిందని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షు డు పాకాల శంకర్‌గౌడ్‌ అన్నారు. మంగళ వారం సిరిసిల్లలోని శివనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీఎస్‌యూటీఎఫ్‌ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు.

సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్‌ కృషి
మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పాకాల శంకర్‌గౌడ్‌

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 13: తెలం గాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఏర్పడినప్పటి నుంచి  ఉపాధ్యాయుల సమ స్యల పరిష్కారంలో ముందుండి పోరాటం చేసిందని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షు డు పాకాల శంకర్‌గౌడ్‌ అన్నారు. మంగళ వారం సిరిసిల్లలోని శివనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీఎస్‌యూటీఎఫ్‌ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో 1974 ఆగస్టు 10న యూటీఎఫ్‌, స్వరాష్ట్రం సిద్ధించాక 2014 ఏప్రిల్‌ 13న టీఎస్‌యూటీఎఫ్‌ ఆవిర్భవించిందని అన్నారు.  ఉపా ధ్యాయ ఐక్య ఉద్యమాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు.  ప్రైవేట్‌  పాఠ శాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి నగదు, బియ్యం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇతర కోర్సుల్లో పనిచేసే ఉపాధ్యాయులతో పాటు పార్ట్‌టైం ఇన్స్‌స్ట్రక్టర్లను, మోడల్‌స్కూ ళ్లలో పనిచేసే గెస్ట్‌ టీచర్లను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్‌, జిల్లా కార్యదర్శి జక్కని నవీన్‌, ఉపాధ్యక్షుడు జంగిటి రాజు, కార్య దర్శులు కొండికొప్పుల రవి, పాముల స్వామి, అంబటి రమేష్‌, ఆడెపు శివకుమార్‌, కనకుంట్ల మధు, ఎంఎస్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బెజగం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-14T06:09:33+05:30 IST