‘వైవీ సుబ్బారెడ్డి అలా చెప్పడం దారుణం’
ABN , First Publish Date - 2020-05-25T23:00:59+05:30 IST
శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని ఇండో అమెరికన్ బ్రాహ్మణసంస్థ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు.
అమరావతి: శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని ఇండో అమెరికన్ బ్రాహ్మణసంస్థ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆస్తులను పరిరక్షించుకోలేక అమ్మకానికి పెడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తులు నిరర్దకమైనవని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం దారుణమన్నారు. టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.